ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఇక నో షేరింగ్‌!

ABN , First Publish Date - 2021-02-06T05:58:53+05:30 IST

ఫేస్‌బుక్‌కు చెందిన ఫొటో షేరింగ్‌ యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ పోస్టులను షేర్‌చేయడం, రీషేప్‌ చేయడం డిజేబుల్‌ ఇకపై కుదరకపోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఇక నో షేరింగ్‌!

ఫేస్‌బుక్‌కు చెందిన ఫొటో షేరింగ్‌ యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌’ పోస్టులను షేర్‌చేయడం, రీషేప్‌ చేయడం డిజేబుల్‌ ఇకపై కుదరకపోవచ్చు. ఆ ఆప్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తొలగిస్తోంది. రీషేప్‌ చేసే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ ఉంది. అయినప్పటికీ ట్రయల్‌బేసిస్‌లో కొందరికి ఈ సమాచారం వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ టెస్ట్‌ ట్రయల్‌ ఎన్ని దేశాల్లో అన్నది మాత్రం సమాచారం లేదు. 


స్టోరీలపై ఫొటోల రీ షేరింగ్‌ సర్వసాధారణం. పనిలోపనిగా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. గడచిన 30 రోజుల్లో డిలీట్‌ చేసిన కంటెంట్‌, ఫొటోలు, వీడియోలు తిరిగి పొందే సౌలభ్యాన్ని కల్పించింది. ‘హ్యాకర్ల నుంచి రక్షణకు మేం కట్టుబడి ఉన్నాం. కొందరు హ్యాకర్లు కంటెంట్‌ను డిలీట్‌ చేస్తుంటారు.  వాటిని తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నాం. అయితే సరైన అకౌంట్‌ హోల్డర్‌ అవునా, కాదా అని నిర్దారించుకున్న తరువాతనే దీనిని అనుమతిస్తాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌ అధికారికంగా వెల్లడించింది.


Updated Date - 2021-02-06T05:58:53+05:30 IST