దశలవారీగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2021-10-18T04:51:35+05:30 IST

దశలవారీగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ

దశలవారీగా నామినేటెడ్‌ పోస్టుల భర్తీ
ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో టీఆర్‌ఎస్‌ నాయకులు

తలకొండపల్లి: పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు తగిన విధంగా గుర్తింపు ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ అన్నారు. దశల వారీగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని ప్రభుత్వ పరంగా నామినేటెడ్‌ పోస్టులన్నీ భర్తీ చేయించి అందరికీ అవకాశాలు కల్పిస్తామని ఈ ఆయన పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్‌ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ పాలక మండలి నియామకం నేపథ్యంలో ఆదివారం గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు, పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే జైపాల్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పండుగు శుభాకాంక్షలు తెలపారు. పూలమాలలు, శాలువాలతో ఎమ్మెల్యేను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి పాలక మండలి సభ్యులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు కె.యాదయ్య, శ్రీశైలంయాదవ్‌, హరిమోహన్‌రెడ్డి, ఆంజనేయులు, జంగయ్య, కొమరయ్య, రామదాసు, తిరుపతి, శేఖర్‌, యాదయ్య ఉన్నారు.

Updated Date - 2021-10-18T04:51:35+05:30 IST