టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బీ ఫామ్ అందుకున్న నోముల భగత్

ABN , First Publish Date - 2021-03-29T20:43:48+05:30 IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. భగత్‌కు కేసీఆర్ బీ ఫామ్ ఇచ్చారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బీ ఫామ్ అందుకున్న నోముల భగత్

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. భగత్‌కు కేసీఆర్ బీ ఫామ్ ఇచ్చారు. సోమవారం ఉదయం భగత్ నామినేషన్ వేస్తారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్‌.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగిన నష్టాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో పూడ్చుకున్నామని.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ఇక తిరుగులేదని నిరూపించుకోవాలని.. అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దీంతో సాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అంశాన్నీ కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థి ఎవరనేది మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా చివరిదాకా సీఎం గోప్యత పాటించారు. కాగా.. పార్టీ తరఫున అభ్యర్థి ఖరారు కాకముందే.. ప్రచార బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు స్థానికంగా తీవ్రస్థాయిలో పనిచేస్తున్నారు.  



Updated Date - 2021-03-29T20:43:48+05:30 IST