గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

ABN , First Publish Date - 2020-12-17T22:38:54+05:30 IST

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్‌ను...

గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ సేవలు ఇక నాన్ ఎయిర్‌టెల్ యూజర్స్‌కు కూడా..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ మరో సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్‌ను నాన్-యూజర్స్‌ కూడా ఆస్వాదించే అవకాశాన్ని కల్పించినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్‌ను వీక్షించేందుకు నాన్‌యూజర్స్ కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను ఆ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. నాన్ ఎయిర్‌టెల్ యూజర్స్‌ కోసం రూ.499 నుంచి మొదలుకుని ప్లాన్స్ తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.


ఆండ్రాయిడ్ టీవీ, ఫైర్‌ టీవీ స్టిక్, క్రోమ్‌కాస్ట్ వినియోగించేవారు ఈ ప్లాన్స్‌‌తో ఎక్స్‌స్ట్రీమ్ కంటెంట్‌ను వీక్షించవచ్చని ఎయిర్‌టెల్ వెల్లడించింది. రూ.499, రూ.799, రూ.999, రూ.1,499, రూ.3,999 ప్లాన్స్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సేవలు ఆస్వాదించవచ్చని ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ డీటీహెచ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ యూజర్స్‌కు ఎక్స్‌స్ట్రీమ్ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-12-17T22:38:54+05:30 IST