తీరు మార్చుకోని హైదరాబాద్ నగర ప్రజలు
ABN , First Publish Date - 2020-03-24T15:05:54+05:30 IST
తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినా.. హైదరాబాద్ నగర ప్రజలు మాత్రం తీరు మార్చుకోవడంలేదు.
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినా.. హైదరాబాద్ నగర ప్రజలు మాత్రం తీరు మార్చుకోవడంలేదు. పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పించినా జనం రోడ్డెక్కుతున్నారు. యథేచ్చగా బైక్లు, ఆటోలు, కార్లలో తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రోడ్లపై వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు పోలీసుల ఎదుట ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆస్పత్రులకు వెళ్లాలంటూ పాత ప్రిస్కిప్షన్లు చూపిస్తున్నారు.