సోషల్‌ మీడియాలో యువతిపై అసభ్యప్రచారం

ABN , First Publish Date - 2020-09-19T11:42:20+05:30 IST

సమీప బంధువైన యువతి ఫొటోలు సేకరించి సోషల్‌మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న వ్యక్తిని సైబర్‌క్రైం పోలీసులు...

సోషల్‌ మీడియాలో యువతిపై అసభ్యప్రచారం

సమీప బంధువే నిందితుడు.. 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సమీప బంధువైన యువతి ఫొటోలు సేకరించి సోషల్‌మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న వ్యక్తిని సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గత కొం తకాలంగా ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో ఓ యువతి ఫొటోలు పెట్టి, అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన సైబర్‌క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ ప్రారంభించా రు. యువతికి సమీప బంధువు అయిన ఖైరతాబాద్‌ ప్రాంతానికి చెందిన కేశవరెడ్డి అనే వ్యక్తి, యువతి గురించి అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నాడని గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2020-09-19T11:42:20+05:30 IST