పరిషత్ పోలింగ్కు ఒడిసా అడ్డంకులు
ABN , First Publish Date - 2021-04-09T08:43:36+05:30 IST
పరిషత్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొఠియా గ్రామాల్లో గురువారం యుద్ధవాతావరణం నెలకొంది. కరోనా పేరుతో కొఠియా గ్రామాల మధ్య రహదారులను ఒడిశా పోలీసులు మూసివేశారు
సాలూరు రూరల్, ఏప్రిల్ 8: పరిషత్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొఠియా గ్రామాల్లో గురువారం యుద్ధవాతావరణం నెలకొంది. కరోనా పేరుతో కొఠియా గ్రామాల మధ్య రహదారులను ఒడిశా పోలీసులు మూసివేశారు. వారికి ఏపీ అధికారులు గట్టిగానే సమాధానం ఇచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్, సాలూరు సీఐ లెంక అప్పలనాయుడు, ఎస్ఐ పి.దినకర్ ఓటర్లకు భరోసా కల్పించారు. వారిని తమ వాహనాల్లో నేరేళ్లవలస పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు.