కరోనా వైరస్ నేపథ్యంలో పకడ్బందీ చర్యల మధ్య ఒలింపిక్స్
ABN , First Publish Date - 2021-07-31T08:52:59+05:30 IST
కరోనా వైరస్ ఇంకా వణికిస్తున్న నేపథ్యంలో అత్యంత పకడ్బందీ చర్యల మధ్య ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు.
ఐదు లక్షల నమూనాలు
కరోనా వైరస్ ఇంకా వణికిస్తున్న నేపథ్యంలో అత్యంత పకడ్బందీ చర్యల మధ్య ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. అథ్లెట్లు, అధికారులు, మీడియా ప్రతినిధులు, క్రీడలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ రోజూ కొవిడ్ టెస్ట్లు చేస్తున్నారు. ఇలా నిత్యం టెస్ట్లకోసం 30వేల మంది ఓ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఒక మిల్లీమీటర్ ఉమ్మిని నిర్వాహకులకు ఇస్తున్నారు. మొత్తం 17 రోజులలో కలిపి సేకరించిన ఉమ్మి నమూనాల సంఖ్య ఐదు లక్షలు ఉంటుందని అంచనా. ఇక..శుక్రవారం వరకు 23మంది అథ్లెట్లు సహా గేమ్స్తో సంబంధంఉండి కరోనా బారిన పడిన వారి సంఖ్య 220కి చేరింది.