విరాళంగా ఒకరోజు జీతం: ఉద్యోగుల జేఏసీ

ABN , First Publish Date - 2020-10-22T07:59:33+05:30 IST

వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ

విరాళంగా ఒకరోజు జీతం: ఉద్యోగుల జేఏసీ

వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ జేఏసీ ప్రధాన కార్యదర్శి వి.మమత, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అక్టోబరు మాసానికి గాను ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఒకరోజు వేతనం మొత్తం రూ.33 కోట్లను విరాళంగా ఇస్తుండడం పట్ల ఉద్యోగ సంఘాలను మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అభినందించారు. 


Updated Date - 2020-10-22T07:59:33+05:30 IST