జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-08T12:23:52+05:30 IST

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్/బర్కత్‌పుర : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాచిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట రామాలయం వీధికి చెందిన ఎస్‌.యశ్వంత్‌కిరణ్‌(35) కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌వైజర్‌. ఆయనకు వివాహం కాలేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాచిగూడలోని సుప్రభాత్‌ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. యశ్వంత్‌కిరణ్‌ లాడ్జి గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాచిగూడ పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-08T12:23:52+05:30 IST