ఏబీని ఆఖర్లో పంపిస్తారా?
ABN , First Publish Date - 2020-10-17T08:48:10+05:30 IST
ఫామ్లో ఉన్న ఏబీ డివిల్లీర్స్ను ఆఖర్లో పంపించడం వల్లే పంజాబ్తో ఆడిన చివరి మ్యాచ్లో బెంగళూరు విజయావకాశాలు...
న్యూఢిల్లీ: ఫామ్లో ఉన్న ఏబీ డివిల్లీర్స్ను ఆఖర్లో పంపించడం వల్లే పంజాబ్తో ఆడిన చివరి మ్యాచ్లో బెంగళూరు విజయావకాశాలు దెబ్బతిన్నాయని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఎడమ, కుడి చేతివాటం కాంబినేషన్ను దృష్టిలో పెట్టుకొని ఏబీని ఆరులో పంపామని మ్యాచ్ ముగిశాక కోహ్లీ ఇచ్చిన వివరణ సహేతుకంగా లేదని వీరూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కోసమే అనుకుంటే సుందర్ అవుటయ్యాక శివమ్ దూబేను ఎందుకు పంపించారు? ముందు మ్యాచ్లో అదే మైదానంలో 33 బంతుల్లోనే 73 రన్స్ కొట్టిన ఏబీని టాప్లో పంపిస్తే అతడికి ఎక్కువ బంతులాడే అవకాశం వచ్చేది. బెంగళూరు స్కోరు పెరిగేది’ అని సెహ్వాగ్ అన్నాడు.