ఒప్పో 5జీ ఫోన్‌

ABN , First Publish Date - 2021-01-19T05:51:18+05:30 IST

చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ఒప్పో.. భారత మార్కెట్లోకి 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో రెనో 5 ప్రో 5జీ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ.35,990.

ఒప్పో 5జీ ఫోన్‌

  • ధర రూ.35,990

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ఒప్పో.. భారత మార్కెట్లోకి 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఒప్పో రెనో 5 ప్రో 5జీ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ ధర రూ.35,990. దీంతోపాటు ఎంకో ఎక్స్‌ పేరుతో వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ను సైతం ఆవిష్కరించింది సంస్థ. దీని ధర రూ.9,990. రెండింటి విక్రయాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. రెనో సిరీ్‌సలో ఒప్పో ప్రవేశపెట్టిన తొలి 5జీ ఫోన్‌ ఇదే. 


200కు పైగా ఐపీఆర్‌ల ఫైలింగ్‌ : ఒప్పో ఈ మధ్యనే హైదరాబాద్‌లో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌లో కొత్త 5జీ ఫోన్ల అభివృద్ధితో పాటు ఆవిష్కరణలపైనా దృష్టిసారించినట్లు ఒప్పో ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, ఆర్‌ అండ్‌ డీ అధిపతి తస్లీమ్‌ ఆరిఫ్‌ తెలిపారు. ఇప్పటివరకు 120కి పైగా మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్‌) దరఖాస్తులు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 80 ఐపీఆర్‌ల ఫైలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 


ఫీచర్లు 

6.5 అంగుళాల 1080 పిక్సెల్‌ ఏఎంఓఎల్‌ఈడీ టచ్‌స్ర్కీన్‌ 

మీడియాటెక్‌ డిమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌తో కూడిన తొలిఫోన్‌

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత కలర్‌ఓఎస్‌ 11.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌

8 జీబీ ర్యామ్‌, 128జీబీ అంతర్గత స్టోరేజీ సామర్థ్యం

4 రియర్‌ కెమెరాలు (64 ఎంపీ, 8ఎంపీ అలా్ట్రవైడ్‌, 

 2ఎంపీ మ్యాక్రో, 2ఎంపీ మోనో), ఎల్‌ఈడీ ఫ్లాష్‌ మాడ్యూల్‌ 

Updated Date - 2021-01-19T05:51:18+05:30 IST