అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం
ABN , First Publish Date - 2022-01-10T21:50:58+05:30 IST
అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం అయింది. విద్యుత్
అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం అయింది. విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో వాడీవేడీ చర్చ జరిగింది. సోలార్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. కొవిడ్ వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నానంటూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ లేఖ రాశారు. వారం రోజుల కిందటే కొవిడ్ వస్తే ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని సభ్యులు మండిపడ్డారు. లేఖ రాసిన తీరుపై పీఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీ కమిటీలనే ఆదేశించే స్థాయికి కార్యదర్శులు వచ్చారా అంటూ పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.