ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలు: నిమ్మల
ABN , First Publish Date - 2020-06-01T18:04:10+05:30 IST
ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలు: నిమ్మల
ఏలూరు: ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్వయంగా అధికార పార్టీ ఎంపీనే వీడియో రిలీజ్ చేశారంటే.. దోపిడీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో అర్థమవుతోందన్నారు. భూ అక్రమాలపై కలెక్టర్, ఎస్పీని కలిసినా చర్యలు లేవని విమర్శించారు. ఇరిగేషన్, డ్రైన్లు, శ్మశానాలను వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని నిమ్మల మండిపడ్డారు.