వ్యాక్సిన్ వేయించుకున్న పంత్!

ABN , First Publish Date - 2021-05-14T16:05:45+05:30 IST

టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ `కోవిడ్‌-19` వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాడు.

వ్యాక్సిన్ వేయించుకున్న పంత్!

టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ `కోవిడ్‌-19` వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. `నా తొలి డోసు పూర్తయింది. మీరూ అర్హులై ఉంటే దయచేసి వ్యాక్సిన్‌ వేయించుకోండి. మనమెంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామో.. అంత త్వరగా కరోనాను జయిస్తామ`ని ట్వీట్‌ చేశాడు.


టీమిండియా ఆటగాళ్లందరూ కోవిషీల్డ్ మొదటి డోసును భారత్‌లో తీసుకుంటున్నారు. రెండో డోసును ఇంగ్లండ్ వెళ్లాక అక్కడ తీసుకుంటారు. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు త్వరలోనే ఇంగ్లండ్ పయనమవనుంది. 

Updated Date - 2021-05-14T16:05:45+05:30 IST