మరో వివాదంలో పరకాల ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-08-08T20:58:01+05:30 IST
వరంగల్ రూరల్ జిల్లా : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. జిల్లా ఏర్పాటు డిమాండ్పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్ రూరల్ జిల్లా : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. జిల్లా ఏర్పాటు డిమాండ్పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దళితులైన జడ్పీటీసీ చిలువేరు మొగిలి, ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలతను వెనుక వరుసలో నిల్చోబెట్టి సమావేశం నిర్వహించారని దళిత సంఘాలు ఆరోపించాయి. సమావేశానికి పిలిచి దళిత ప్రజాప్రతినిధులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే.. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపిస్తున్నారు.