ప్రయాణికుల విమానంలో సరుకు రవాణా
ABN , First Publish Date - 2020-04-04T05:52:14+05:30 IST
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల విమానంలో విదేశాలకు నిత్యావసర, అత్యవసర వస్తువులు రవాణా అయ్యాయి. డీజీసీఏ అనుమతులకు లోబడి గురువారం ఖతార్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల విమానంలో విదేశాలకు నిత్యావసర, అత్యవసర వస్తువులు రవాణా అయ్యాయి. డీజీసీఏ అనుమతులకు లోబడి గురువారం ఖతార్ కార్గోకు చెందిన క్యూఆర్ 8311 విమానం హైదరాబాద్ నుంచి దోహాకు ఔషధాలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లిందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ఎస్జీకే కిషోర్ తెలిపారు.