జనసేన బలోపేతంపై పవన్‌ ప్రణాళికలు

ABN , First Publish Date - 2022-01-07T22:27:58+05:30 IST

జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీలో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల నిర్మాణాలపై దృష్టి సారించారు.

జనసేన బలోపేతంపై పవన్‌ ప్రణాళికలు

అమరావతి: జనసేన పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీలో జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల నిర్మాణాలపై దృష్టి సారించారు. కమిటీ ఏర్పాటుపై వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన సంస్థాగత నిర్మాణానికి సీనియర్ నాయకులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కమిటీ సభ్యులుగా అర్హన్ ఖాన్, పంతం నానాజీ, ముత్తా శశిధర్ నియమించారు. తొలుత జిల్లా కమిటీలు, తర్వాత మండల, గ్రామస్థాయి కమిటీలను ఎన్నుకోనున్నారు.

Updated Date - 2022-01-07T22:27:58+05:30 IST