మహిళలను అవమానించడం బాధాకరం: పవన్

ABN , First Publish Date - 2021-03-09T00:12:50+05:30 IST

అమరావతి మహిళలను అవమానించడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మహిళలను అవమానించడం బాధాకరం: పవన్

అమరావతి: అమరావతి మహిళలను అవమానించడం బాధాకరమని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సోమవారం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని ఆగ్రహం  వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని మహిళలు పోరాడుతున్నారని చెప్పారు. వారు కనకదుర్గమ్మను దర్శనం చేసుకొనేందుకు వెళ్లడం‌ నేరమా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అడ్డుకొని లాఠీలు ఝుళిపించారని తెలిపారు. అరెస్టులు చేసిన విధానం అవమానకర రీతిలో ఉందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. మహిళలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన సిబ్బందిపై.. తగిన చర్యలు తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Updated Date - 2021-03-09T00:12:50+05:30 IST