పండిట్ రవిశంకర్‌తో కలిసి ధ్యానంలో పాల్గొనండి: పవన్

ABN , First Publish Date - 2020-04-10T14:23:28+05:30 IST

అమరావతి: పండిట్ రవిశంకర్ చొరవకు తాను మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

పండిట్ రవిశంకర్‌తో కలిసి ధ్యానంలో పాల్గొనండి: పవన్

అమరావతి: పండిట్ రవిశంకర్ చొరవకు తాను మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనతో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని ట్విట్టర్ వేదికగా పవన్ పిలుపునిచ్చారు. ‘‘గొప్ప మానవతావాది అయిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురదేవ్ రవిశంకర్ గారి చొరవరకు మనస్పూర్తిగా నా మద్దతు తెలుపుతున్నా. ఈ కల్లోల సమయాన్ని ప్రతిఒక్కరూ ధృడ సంకల్పంతో అధిగమించగలరని కోరుకుంటూ.. రవిశంకర్ గారితో కలిసి లక్షలాదిగా ధ్యానంలో పాల్గొనాలని కోరుతున్నా’’ అని పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-10T14:23:28+05:30 IST