అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-06-01T20:24:14+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది.
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి చెరువు సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. చెట్టుకు ఉరివేసుకున్న ఆనవాళ్లున్నట్టు స్థానికులు గుర్తించారు. చనిపోయి ఎక్కువ రోజులు కావడంతో మృతదేహం అస్తిపంజరంలా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.