రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2020-08-13T16:21:12+05:30 IST

చిత్తూరు: పూతలపట్టు మండలం రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది.

రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి

చిత్తూరు: పూతలపట్టు మండలం రామనగర్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. టి.రంగంపేట్‌కు చెందిన నిఖిల్ చౌదరి అనే వ్యక్తి దినేష్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన దినేష్‌ను చికిత్స నిమిత్తం వెల్లూరు సీఎంసీకి తరలించారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతర్గత కలహాలే దాడికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పూతలపట్టు పోలీసులు నిఖిల్‌ని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-08-13T16:21:12+05:30 IST