రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలి: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-11-04T22:07:51+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభినందించకపొగా, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని అరుణ నిప్పులు చెరిగారు. ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వ్యాట్ను తగ్గించి ప్రజలకు భారం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటే.. కేసీఆర్ మాత్రం సోయి కూడా లేదని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు ప్రజల సమస్యలపై పట్టింపు లేదని అరుణ దుయ్యబట్టారు.