ముంబైలో లీటర్ 102రూపాయలకు చేరిన పెట్రోల్ ధర

ABN , First Publish Date - 2021-06-11T14:48:56+05:30 IST

దేశంలో శుక్రవారం మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి....

ముంబైలో లీటర్ 102రూపాయలకు చేరిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ : దేశంలో శుక్రవారం మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో పెట్రోలు ధర వందరూపాయలు దాటింది. ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ. 102.04లకు చేరింది. ముంబైలో డీజిల్ లీటరు ధర రూ.94.15గా ఉంది. ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ లీటరుపై 29 పైసలు పెరగడంతో దీని ధర రూ.95.85కు, డీజిల్ ధర రూ86.76.కు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్,డీజిల్ ధరలు సమాంతరంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో శుక్రవారం పెట్రోల్ లీటరు ధర రూ.99.61, డీజిల్ ధర రూ.94.56కు పెరిగాయి. 


ముంబైలో పెట్రోల్ లీటరు ధర వందరూపాయలు దాటగా హైదరాబాద్ నగరంలో వందరూపాయలకు చేరువలో  ఉంది. భోపాల్ నగరంలో పెట్రోల్ లీటరు ధర 104రూపాయలకు పెరిగింది. పెట్రోలు ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు పెట్రోలు పోయించుకోవాలంటేనే భయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్  లో ముడిచమురు ధరలు పెరగుతుండటంతో పెట్రో ధరలు ఆకాశన్నంటుతున్నాయి.

Updated Date - 2021-06-11T14:48:56+05:30 IST