పాక్ టీ20 జట్టులో భారీ కాయుడు
ABN , First Publish Date - 2021-06-05T06:19:52+05:30 IST
వంద కిలోల భారీ కాయుడు.. కరాచీ చిచ్చర పిడుగు ఆజమ్ ఖాన్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న పాకిస్థాన్ టీ20 బృందంలో చోటు దక్కించుకున్నాడు. ఈ 22 ఏళ్ల వికెట్కీపర్-బ్యాట్స్మన్ పాక్ మాజీ కెప్టెన్
కరాచీ: వంద కిలోల భారీ కాయుడు.. కరాచీ చిచ్చర పిడుగు ఆజమ్ ఖాన్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న పాకిస్థాన్ టీ20 బృందంలో చోటు దక్కించుకున్నాడు. ఈ 22 ఏళ్ల వికెట్కీపర్-బ్యాట్స్మన్ పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కొడుకు కావడం విశేషం. ఏడాదిగా బరువు తగ్గడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ఆజమ్.. జాతీయ జట్టులో చోటు కోసం 130 నుంచి 100 కిలోలకు బరువు తగ్గాడు. గత పీఎస్ఎల్లో ధనాధన్ బ్యాటింగ్తో సెలెక్టర్లను ఆకర్షించడంతో వెస్టిండీ్సతో జరగనున్న 5 టీ20ల సిరీస్కు అతడు ఎంపికయ్యాడు. వచ్చేనెల 8న ప్రారంభమవనున్న ఈ కరీబియన్ టూర్లో పాక్ 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. మూడు ఫార్మాట్లకు బాబర్ ఆజమ్నే సారథిగా పీసీబీ నియమించింది.