పోడు భూములకోసం పోరు గర్జన
ABN , First Publish Date - 2021-03-02T05:27:09+05:30 IST
పోడు భూములకోసం పోరు గర్జన
భద్రాచలంలో గిరిజనుల భారీ ర్యాలీ
ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేత
భద్రాచలం, మార్చి 1: పోడు భూములకు పట్టాలు ఇవ్వా లని, హరితహారం పేరుతో పోడు భూముల ఆక్రమణను నిలు పుదల చేయాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వ ర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజ నులు భద్రాచలంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనం తరం ఐటీడీఏ పీవో పి.గౌతమ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంఎల్ పార్టీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, ఏఐకే ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.కోటేశ్వరరావులు మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో పేదలైన ఆదివాసీ గిరిజ నుల భూములను దౌర్జన్యంగా ఆక్రమిస్తూ ట్రెంచ్లు కొడుతున్నారని ఆరోపించారు. అటవీ అధికా రుల వైఖరి చట్టవిరుద్దమైందన్నారు. తక్షణమే ఐటీడీఏ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజలకు తగిన న్యాయం జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ వాగబోయిన రామక్క పాల్గొన్నారు.