చేపల చెరువులో విషం కలిపిన దుండగులు
ABN , First Publish Date - 2020-08-15T23:12:03+05:30 IST
జిల్లాలోని త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామ సొసైటీ చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆ చేపల చెరువులో విషం కలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణయ్య
ప్రకాశం : జిల్లాలోని త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామ సొసైటీ చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆ చేపల చెరువులో విషం కలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఎస్సై కృష్ణయ్య ఘటనా స్థలికి చేరుకుని చెరువును పరిశీలించారు. విష ప్రయోగంపై గ్రామస్తులను విచారించారు. ఘటనా స్థలంలో విషం కలిపి రెండు వాటర్ బబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. విష ప్రయోగం కారణంగా ప్రస్తుతానికైతే తక్కువ మొత్తంలో చేపలు మృతి చెందాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.