కూలీలను అడ్డుకుని ఆశ్రయం కల్పించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-03-30T20:22:36+05:30 IST
రంగారెడ్డి: లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక కడుపు చేత పట్టుకుని వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు.
రంగారెడ్డి: లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక కడుపు చేత పట్టుకుని వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో వివిధ గ్రామల నుంచి వస్తున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వారికి పెద్దమంగళారం గ్రామంలోని బీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆశ్రయం కల్పించి.. భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.