ఈ డ్రామాలేంటి వెల్లంపల్లిగారు? పీఠలపై రాజకీయం తగునా?: పోతిన మహేష్

ABN , First Publish Date - 2021-06-23T17:59:13+05:30 IST

శివ స్వామికి బ్రహ్మంగారి మఠానికి సంబంధమేంటని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

ఈ డ్రామాలేంటి వెల్లంపల్లిగారు? పీఠలపై రాజకీయం తగునా?: పోతిన మహేష్

విజయవాడ: శివ స్వామికి బ్రహ్మంగారి మఠానికి సంబంధమేంటని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. పీఠలపై రాజకీయం చేయడం తగునా అని మంత్రి వెల్లంపల్లిని నిలదీశారు. ‘‘ఈ డ్రామాలు ఏంటీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారూ పీఠలపై మీకు రాజకీయం తగునా? శివస్వామిగారికి బ్రహం గారి మఠంకు ఏం సంబంధం? నేడు ఏ ప్రాతిపదికన వారి వద్ద నివేదిక తీసుకున్నారు? బ్రహ్మంగారి భక్తులను అనవసర ఆందోళనకు గురి చేయొద్దు’’ అని పోతిన మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2021-06-23T17:59:13+05:30 IST