ప్రకాశం జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-08-13T12:30:07+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా మరో 681కు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 11,170కు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 182 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు 147 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,80,813 శ్యాంపిళ్లు పంపగా...అందులో 1,67,545 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 3356 రిపోర్టులు రావాల్సి ఉంది. నిన్న కరోనా నుండి కోలుకుని 57 మంది డిశ్చార్జ్ అయ్యారు. 27 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ప్రస్తుతం 2045 యాక్టివ్ కేసులు ఉన్నాయి.