ప్రకాశం జిల్లాలో కొత్తగా 319 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-01T12:28:52+05:30 IST
ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 319 కేసులు నమోదు అయ్యాయి.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా మరో 319 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,884కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 41 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి నలుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 492 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 104 మంది డిశ్చార్జ్ అయ్యారు. 38 మందిని హోం ఐసోలేషన్కు పంపారు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్లలో ప్రస్తుతం 8208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.