పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-06-16T04:48:26+05:30 IST
పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలి
జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య ఉద్యోగుల నిరసన
వరంగల్ రూరల్ కల్చరల్, జూ న్ 15: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పీఆర్సీ ప్రకారం పెంచాలని, ఎన్హెచ్ఎం రెగ్యూలర్ ఉద్యోగుల సవ ుస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య ఉద్యోగులు రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన నిర్వహించినట్లు ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి బత్తిని సు దర్శన్ గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లా వైద్య ఆరో గ్య శాఖ కార్యాలయం ఎదుట మధ్యాహ్నం ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, సమస్యలను పరిష్క రించాలని కోరుతూ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, వైద్య కార్యాలయాలు, గ్రామీణ జిల్లా ఆరోగ్య కేంద్రాల ఎదుట ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 11వ పీఆర్సీలో రెగ్యూలర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలన్నారు. ఇప్పటి వరకు సుమా రుగా 50మంది కరోనాతో మృతి చెందారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందజేసి కు టుంబం లోని ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. 108 ఉద్యోగులకు వేత నాలు పెంచి 30 శాతం అదనంగా ఇవ్వాలన్నారు. 11 డిమాం డ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర డైరెక్టర్కు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో యాదా నాయక్, రామా రాజేష్ఖన్నా, కిషన్, వెంకటరమణ, సంపత్, అనిశెట్టి రమేష్, సతీష్, చంద్రకళ, మల్లికార్జున్, రహమాన్, ప్రవీన్, రవీందర్ రెడ్డి, జ్యోతి, రాము, జైపాల్, స్వరూప, విజయ, సిరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.