మాస్కు ఎందుకు పెట్టుకోలేదని అడిగితే.. నోర్మూసుకో అంటూ మండిపడ్డ అధ్యక్షుడు!

ABN , First Publish Date - 2021-06-23T02:04:14+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా కూడా మాస్కు పెట్టుకోకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో.

మాస్కు ఎందుకు పెట్టుకోలేదని అడిగితే.. నోర్మూసుకో అంటూ మండిపడ్డ అధ్యక్షుడు!

బ్రజీలియా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా కూడా మాస్కు పెట్టుకోకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారో. ఇటీవల ఒక బైక్ ర్యాలీలో కూడా మాస్కు లేకుండా పాల్గొనడంతో ఆయనకు జరిమానా వేశారు. ఈ క్రమంలో తాజాగా బొల్సనారో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు కూడా మాస్కు లేకుండానే ఆయన వచ్చారు. ఇది చూసిన ఒక జర్నలిస్టు ఆయన్ను ప్రశ్నించాడు. ‘‘మీరు మాస్కెందుకు పెట్టుకోరు?’’ అని అడగ్గా.. ఆ జర్నలిస్టుపై బొల్సనారో విరుచుకుపడ్డారు. ‘‘మీరందరూ కలిసి బ్రెజిల్ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. బ్రెజిల్ మతాన్ని నాశనం చేస్తున్నారు. మీరంతా అసహ్యకరమైన మనుషులు’’ అంటూ మండిపడ్డారు. ‘‘నా ఇస్టం వచ్చినట్లు నేను వస్తా. నా ప్రాణం బాధ్యత నేను చూసుకుంటా’’ అంటూ ధ్వజమెత్తారు. దీంతో సదరు జర్నలిస్టు నోరు మెదపలేకపోయాడు.

Updated Date - 2021-06-23T02:04:14+05:30 IST