ఏడు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-09-23T23:40:12+05:30 IST

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం జగన్ తిరుమల పర్యటనలో ఉన్నారు.

ఏడు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్

ఢిల్లీ: ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం జగన్ తిరుమల పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే జగన్ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జగన్‌తో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, యూపీ, కర్ణాటక సీఎంలు పాల్గొన్నారు. ఈ 7 రాష్ట్రాల్లోనే 63 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలో కోవిడ్ మరణాలు 2 శాతం దాటాయి. కరోనా కట్టడి చర్యలు, రాష్ట్రాల సమస్యలపై సీఎంలకు ప్రధాని సూచనలు చేశారు.


Updated Date - 2020-09-23T23:40:12+05:30 IST