పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు కేంద్రాలు ఇవ్వం
ABN , First Publish Date - 2021-04-09T09:16:04+05:30 IST
పది, ఇంటర్ వార్షిక పరీక్షల కేంద్రాలుగా ప్రైవేటు పాఠశాలలను ఇవ్వకూడదని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పది, ఇంటర్ వార్షిక పరీక్షల కేంద్రాలుగా ప్రైవేటు పాఠశాలలను ఇవ్వకూడదని రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతి ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయని, భవనాల అద్దెలు కూడా చెల్లించుకోలేని స్థితిలో ఉన్నాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్ రావు, మధుసూదన్ తెలిపారు.