మాదిగల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-06-19T09:04:20+05:30 IST
మాదిగ ఉపకులాల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆర్థికశాఖా మంత్రి తన్నీరు హరీశ్రావును కోరారు.
మంత్రి హరీశ్కు వంగపల్లి వినతి
సిద్దిపేటఅర్బన్, జూన్ 18 : మాదిగ ఉపకులాల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆర్థికశాఖా మంత్రి తన్నీరు హరీశ్రావును కోరారు. సిద్దిపేటలో మంత్రిని ఆయన నివాసంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. డప్పుకు- చెప్పుకు పెన్షన్తో పాటు బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పించాలని కోరారు. వంగపల్లి పుట్టినరోజు కావడంతో మంత్రి హరీశ్రావు ఆయనకు స్వీట్ తినిపించారు.