సింహాచల దేవాలయ అభివృద్దికి ప్రతిపాదనలు: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2021-08-13T20:59:33+05:30 IST
సింహాచల దేవాలయ అభివృద్దికి ప్రతిపాదనలు పంపామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
విశాఖ: సింహాచల దేవాలయ అభివృద్దికి ప్రతిపాదనలు పంపామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసాదం స్కీమ్ కింద రూ. 70 కోట్లకు ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. కొండపైకి మెట్ల మార్గం పూర్తి చేశామని, మాధవధార నుంచి మెట్ల మార్గాన్ని వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. పుష్కరిణి దీనావస్ధలో ఉందని, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గిరిప్రదక్షిణ చేయడానికి మట్టి రోడ్డుతో ట్రాక్ ఏర్పాటు చేశామని అవంతి శ్రీనివాస్ తెలిపారు.