ఉద్యోగులను కరోనా నుంచి కాపాడండి

ABN , First Publish Date - 2021-05-05T09:03:20+05:30 IST

కరోనా నుంచి పంచాయతీ ఉద్యోగుల్ని కాపాడాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్‌, కార్యదర్శి బండెల రమేశ్‌ డిమాండ్‌ చేశారు

ఉద్యోగులను కరోనా నుంచి కాపాడండి

పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ డిమాండ్‌


అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి పంచాయతీ ఉద్యోగుల్ని కాపాడాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్‌, కార్యదర్శి బండెల రమేశ్‌ డిమాండ్‌ చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలు ఏర్పాట్లు చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. 50 శాతం ఉద్యోగులతో కార్యాలయాలు నిర్వహించాలని, కరోనా బారినపడిన పంచాయతీ కార్యదర్శులకు 28 రోజుల స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను వెంటనే మంజూరు చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-05T09:03:20+05:30 IST