పబ్జీ గేమ్ ఆడుతున్నాడని తల్లి మందలించడంతో..

ABN , First Publish Date - 2020-08-15T23:45:41+05:30 IST

కరోనా వ్యాప్తి కారణంగా విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో ఆన్‌లైన్ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా పబ్జీ గేమ్ పిల్లలను బాగా ఆకర్షిస్తోంది. పబ్జీ ఆడుతూ లోకాన్నే

పబ్జీ గేమ్ ఆడుతున్నాడని తల్లి మందలించడంతో..

హైదరాబాద్: కరోనా వ్యాప్తి కారణంగా విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో ఆన్‌లైన్ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా పబ్జీ గేమ్ పిల్లలను బాగా ఆకర్షిస్తోంది. పబ్జీ ఆడుతూ లోకాన్నే మరచిపోతున్నారు. కొందరైతే పబ్జీలోని క్యారెక్టర్లతో ఊహించుకుని అవే వేశాలతో రోడ్లపైకి వచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. అంతేకాదు.. పబ్జీ గేమ్ ఎన్నో విషాధాలనూ మిగిల్చింది. ఇలాంటే ఘటనే నగరంలో చోటు చేసుకుంది.


తాజాగా నగరంలోని తిరుమలగిరి పీఎస్ పరిధిలోని లోతుకుంటలో పబ్జీ విషాధాన్ని మిగిల్చింది. పబ్జీ గేమ్ ఆడుతున్నాడని ఓ తల్లి తన కొడుకును(14) మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు.. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-15T23:45:41+05:30 IST