రూ.26 లక్షల విరాళం ప్రకటించిన గోపీచంద్.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే?
ABN , First Publish Date - 2020-04-07T03:27:25+05:30 IST
కరోనాపై పోరుకు మరికొందరు క్రీడా ప్రముఖులు ముందుకొచ్చారు. ఇండియన్ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల
హైదరాబాద్: కరోనాపై పోరుకు మరికొందరు క్రీడా ప్రముఖులు ముందుకొచ్చారు. ఇండియన్ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై తదితరులు విరాళాలు ప్రకటించారు. ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ అయిన గోపీచంద్ మొత్తం రూ. 26 లక్షల విరాళం ప్రకటించాడు. ఇందులో రూ.15 లక్షలు పీఎం కేర్స్ ఫండ్కు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. ఐదు లక్షలు ప్రకటించాడు. పంకజ్ అద్వానీ, ధన్రాజ్ పిళ్లై చెరో ఐదు లక్షలు పీఎం కేర్స్ ఫండ్కు విరాళం ప్రకటించారు. ఐ-లీగ్ ఫుట్బాల్ క్లబ్ మినర్వా పంజాబ్ రూ. 5 లక్షలు విరాళం ప్రకటించగా ఇందులో రూ. 2 లక్షలు పీఎం కేర్స్ ఫండ్కు, పంజాబ్, హర్యానా, చండీగడ్లకు చెరో లక్ష రూపాయలు విరాళం ప్రకటించింది.