పులస.. ధర ఎంతో తెలుసా
ABN , First Publish Date - 2020-09-21T08:01:56+05:30 IST
పుస్తెలమ్మైనా.. పులస తినాలని నానుడి! గోదారి పులస రుచి అలాంటి మరి!. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది!
పుస్తెలమ్మైనా.. పులస తినాలని నానుడి! గోదారి పులస రుచి అలాంటి మరి!. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది! పులసలకు పెట్టింది పేరు... తూర్పు‘గోదావరే’! జూలై-సెప్టెంబరు నెలల మధ్య వర్షాకాలంలో.. ‘ఇలస’ చేప.. గోదావరి జలాల్లో ఎదురీదుతూ.. ‘పులస’గా మారుతుందని చెబుతారు.
మత్స్యకారుల వలకు చాలా అరుదుగా పడతాయి. కిలో రూ.4 వేల వరకు ఉంటుంది. దేశంలోనే ఖరీదైన చేప అంటారు. దీని రుచి గురించి తెలిసినవారు.. ధర గురించి ఏమాత్రం ఆలోచించరు.
తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద గోదావరి నదిలో ఆదివారం స్థానిక మత్స్యకారుడి వలలో రెండున్నర కిలోల పులస చేప పడింది. పాశర్లపూడిలో నగరం ఏఎంసీ చైర్మన్ కొమ్ముల కొండలరావు ఈచేపను రూ.21వేలుకు కొనుగోలు చేయడం విశేషం. పులస సాధారణంగా 3 కిలోలకు మించి బరువుండదు. ఎక్కువగా అరకిలో, కిలో లోపు చేపలే దొరుకుతాయి.