ఈనెల 31న పల్స్‌ పోలియో కార్యక్రమం

ABN , First Publish Date - 2021-01-14T21:58:00+05:30 IST

జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 31న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈనెల 31న పల్స్‌ పోలియో కార్యక్రమం

ఢిల్లీ: జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 31న నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియే చుక్కలు వేయనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 31వ తేదీన నిర్వహించనున్నారు. ఇంతకు ముందు జనవరి 17వ తేదీ నిర్వహించింది. కానీ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ 16వ తేదీ నుంచి ప్రారంభిస్తున్న నేపధ్యంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని జనవరి 31వ తేదీకి మార్చారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతనే పల్స్‌పోలియో తేదీ మార్పును ఖరారు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా పల్స్‌ పోలియో కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-01-14T21:58:00+05:30 IST