పీవీ పెద్దల్లుడు కిషన్రావు మృతి
ABN , First Publish Date - 2022-02-09T08:13:22+05:30 IST
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెద్దల్లుడు నచ్చరాజు వెంకటకిషన్రావు(83) హిమాయత్నగర్లోని
హైదరాబాద్ సిటీ/బెజ్జంకి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పెద్దల్లుడు నచ్చరాజు వెంకటకిషన్రావు(83) హిమాయత్నగర్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామం. ఆయన భార్య పీవీ పెద్ద కుమార్తె శారదాదేవి. వారికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఎన్వీ సుభాష్ ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధిగా ఉన్నారు. రెండో కుమారుడు డాక్టర్ కిరణ్ వైద్యరంగంలో స్థిరపడ్డారు. మూడో కుమారుడు శ్రవణ్కుమార్ పేరును ఇటీవలే సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది.
గుగ్గిళ్ళ గ్రామ సర్పంచ్గా పనిచే సిన వెంకటకిషన్ ఏ-క్లాస్ కాంట్రాక్టరుగా స్థిరపడ్డారు. కాంగ్రెస్ రాజకీయాల్లో పీవీ వెన్నంటే ఉండేవారు. ఆయన అంత్యక్రియలు బుధవారం గుగ్గిళ్ళలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం ప్రకటించారు.