జియోలో ‘క్వాల్కామ్’ పెట్టుబడులు
ABN , First Publish Date - 2020-07-13T05:57:11+05:30 IST
రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడుల వరద ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్ ఇన్వె్స్టమెంట్ సంస్థ క్వాల్కామ్ వెంచర్స్... జియో ప్లాట్ఫామ్ ఈక్విటీలో 0.15 శాతం వాటా తీసుకుంది...
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడుల వరద ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెక్నాలజీ దిగ్గజం క్వాల్కామ్ ఇన్వె్స్టమెంట్ సంస్థ క్వాల్కామ్ వెంచర్స్... జియో ప్లాట్ఫామ్ ఈక్విటీలో 0.15 శాతం వాటా తీసుకుంది. ఇందుకోసం ఆ కంపెనీ రూ.730 కోట్లు చెల్లించనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీంతో గత 13 వారాల్లో జియో ప్లాట్ఫామ్స్లో వాటా తీసుకున్న కంపెనీల సంఖ్య 12కు చేరింది. ఈ 12 కంపెనీలు జియో ప్లాట్ఫామ్స్లో రూ.1,18,318 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ప్రపంచంలో మరే సంస్థ ఇంత స్వల్ప కాలంలో ఇంత భారీ పెట్టుబడులు సమీకరించలేదు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ, కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా.. ముకేశ్ అంవానీ నిర్వహణలోని జియో ప్లాట్ఫామ్స్లో ఈ పెట్టుబడులు వెల్లువెత్తటం విశేషం.