రైతుల ఉద్యమానికి వంగవీటి రాధా సంఘీభావం

ABN , First Publish Date - 2020-08-05T18:40:44+05:30 IST

ఏపీ రాజధాని రైతుల ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు.

రైతుల ఉద్యమానికి వంగవీటి రాధా సంఘీభావం

అమరావతి: ఏపీ రాజధాని రైతుల ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తర్వాత అక్కడి నుంచి పాదయాత్రంగా వెళ్లి తుళ్లూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాధా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం  మాట్లాడుతూ రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో 'స్టేటస్కో' ఇవ్వటం ద్వారా తాత్కాలిక ఊరట కలిగిందన్నారు. రాజధాని ఉద్యమ పోరాటంలో రైతులకు అంతిమ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.


232 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని వంగవీటి రాధా అన్నారు. రైతుల న్యాయమైన పోరాట పటిమకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానన్నారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, చివరి క్షణాల వరకు న్యాయపరంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని వంగవీటి రాధా సూచించారు.

Updated Date - 2020-08-05T18:40:44+05:30 IST