ఈటల రాజేందర్ను పరామర్శించిన రఘనందనరావు, రాజాసింగ్
ABN , First Publish Date - 2021-08-01T17:17:59+05:30 IST
ఈటల రాజేందర్ను పరామర్శించిన రఘనందనరావు, రాజాసింగ్
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అపోలో ఆసుపత్రిలో రఘనందనరావు, రాజాసింగ్ పరామర్శించారు. ఆసుపత్రి నుంచి సోమవారం ఈటల డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. హుజురాబాద్ కు చేరుకున్న వెంటనే ఈటల పాదయాత్రను కొనసాగిస్తారని చెప్పారు. హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ఈటల గెలవటం ఖాయమని రాజాసింగ్ అన్నారు. ఏడోసారి ఈటల ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని రాజాసింగ్ స్పష్టం చేశారు.