తొలి డ్రామాకు తెరలేపిందే హరీశ్‌: రఘునందన్‌

ABN , First Publish Date - 2021-08-04T08:50:22+05:30 IST

రాష్ట్రంలో తొలి డ్రామాకు తెరలేపిం దే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు అన్నారు.

తొలి డ్రామాకు తెరలేపిందే హరీశ్‌: రఘునందన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలి డ్రామాకు తెరలేపిం దే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అని బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో(2009, నవంబరు 29న) సిద్దిపేట జిల్లా రంగదాంపల్లిలో తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకోవడానికి ప్రయత్నించి అగ్గిపెట్టె కోసం ఎదురు చూసిన హరీశ్‌రావు చేసింది డ్రామా కాదా? అని నిలదీశారు. లీటరు పెట్రోలు కొనుక్కొచ్చిన ఆయన రూపాయి అగ్గిపెట్టె ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, యెండల లక్ష్మినారాయణలతో కలిసి మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డ్రామాలకు పర్యాయపదం టీఆర్‌ఎస్‌ అన్నారు. మోకాలి ఆపరేషన్‌ జరిగిన ఈటలపై మానవత్వం లేకుండా హరీశ్‌ విమర్శలు చేయడం సరికాదన్నారు.   

Updated Date - 2021-08-04T08:50:22+05:30 IST