ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటేయరు: రఘురామకృష్ణంరాజు
ABN , First Publish Date - 2021-03-09T19:37:55+05:30 IST
ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో..వైసీపీ ఎంపీలు ప్రశ్నలు అడిగి సెల్ఫ్గోల్..
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో..వైసీపీ ఎంపీలు ప్రశ్నలు అడిగి సెల్ఫ్గోల్ వేసుకున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు అడిగి ఆర్థికమంత్రితో..నెగటివ్ సమాధానం చెప్పించుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సంప్రదించామని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంగా చెప్పారని, కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటేయరని అర్ధమవుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సలహాదారులకే సలహాలిచ్చే సీఎం జగన్కు 100 మంది సలహాదారులు అవసరమా? అని ప్రశ్నించారు. జగన్ జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలని కుట్ర అన్న.. రిపబ్లిక్ టీవీ వార్తను తేలిగ్గా కొట్టిపడేయొద్దని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.