నా బొచ్చుతో నీకెందుకు?: రఘురామ

ABN , First Publish Date - 2020-08-13T19:36:55+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నా బొచ్చుతో నీకెందుకు?: రఘురామ

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, ఇప్పుడు డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించిందని.. ఆయన పనేదో ఆయన చేసుకోవాలని, తనపై కామెంట్లు చేయడమేంటని, నా బొచ్చు విషయం ఆయనకెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.


దేవేందర్ రెడ్డి కామెంట్స్.. ‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు స్వపక్షంలో విపక్షమంటూ కొత్త పత్యానికి పరుగులు పెట్టి మాటతో సరిపెట్టుకునేదానికి వేటుదాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్లేనా? విగ్గు ఊడిపోతే రేపటినుంచి ఎలా తిరుగుతారో?’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారన్నారు. దీనిపై స్పందించిన రాఘురామ మాట్లాడుతూ ‘‘పచ్చివాడా నువ్వు సరిగ్గా నిలుచుంటే నా బొడ్డు వరకు రావని.. మరి నీకు నా జుట్టు ఎలా కనబడిందో తెలియదు.. అందరూ నీకులాగా పొట్టిగా, నల్లగా, వికారంగా ఉండాలని కోరుకునే నీ సంస్కారం అయితే నేనేమిచేయలేనని, నా జుట్టును కవర్ చేసుకుంటే నీకెందుకని, నా బొచ్చుకు నీకు ఏంటి సంబంధమని’’ రాఘురామ ప్రశ్నించారు.

Updated Date - 2020-08-13T19:36:55+05:30 IST