రైతులకు సంఘీభావంగా... 19న రాజ్‌భవన్‌ ముట్టడి: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2021-01-17T08:22:42+05:30 IST

రైతులకు సంఘీభావంగా... 19న రాజ్‌భవన్‌ ముట్టడి: ఉత్తమ్‌

రైతులకు సంఘీభావంగా... 19న రాజ్‌భవన్‌ ముట్టడి: ఉత్తమ్‌

హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్న డిమాండ్‌తో ఈ నెల 19వ తేదీన రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ జాతీయ కమిటీ సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు లుంబినీ పార్క్‌ వద్ద సమావేశమై, రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T08:22:42+05:30 IST